హైదరాబాద్

గ్రేటర్ టిఆర్‌ఎస్ కైవసం ఖాయం: పద్మారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 5: గ్రేటర్ ఎన్నికల్లో అన్ని సీట్లు టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి టి.పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం టిడిపి రామంతాపూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు శాగ రవీందర్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు జి.కృష్ణారెడ్డి, హన్మంత్‌రెడ్డి, ప్రభాకర్, నరేందర్, మాధవరెడ్డి, మల్లేష్, నరేష్, అమరేందర్ తదితరులు 200 మంది శనివారం మంత్రి టి.పద్మారావు సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలతో సత్కరించి అభినందించారు. రవీందర్ ఇతరుల చేరికతో పార్టీ మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో సైనికుడిలా పని చేసి గ్రేటర్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి, నేతలు తవిడబోయిన గిరిబాబు, గోపాల్‌రెడ్డి, గడ్డం సాయికిరణ్, లేతాకుల రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి నిధులు
చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి రూ.1.5కోట్ల నిధులు ఇచ్చిన మంత్రి మంత్రి పద్మారావుకు డివిజన్ నేతలు ప్రవీణ్, పల్లె నర్సింగ్‌రావు ఇతర నేతలు శనివారం ఇంటికి వెళ్లి పూలబొకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.