తెలంగాణ

20 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణలో 20 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో సోమవారం ఉత్తర్వులు (జీఓ ఆర్‌టీ నెంబర్ 82) జారీ అయ్యాయి. పదోన్నతి లభించిన వారిలో పి.రాజా విక్రంరెడ్డి, కాంతాల వెంకటేశ్వర్లు,ఎం. కృష్ణ,ఎం.వి.రవీంద్రనాథ్, ఎన్.నటరాజ్, ఎస్. మోహన్‌రావు, ఒడ్డి జోసెఫ్ మధు, నూతి మధుసూదన్, కందూరి చంద్రారెడ్డి, వి.చంద్రశేఖర్‌రెడ్డి, అబ్దుల్ హమీద్, వి. హనుమంతరెడ్డి, ఎ. వెంకట్‌రెడ్డి, వనమాల చంద్రశేఖర్, బి. వెంకటేశ్వర్లు, ఎన్. శ్రీనివాస్‌రావు, టి. పూర్ణచంద్ర, కె. విద్యాసాగర్,జి. భాస్కరరావు,వడ్ల లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరికి ప్రమోషన్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరందరికీ ఇచ్చిన ప్రమోషన్ తాత్కాలిక ప్రమోషన్ మాత్రమేనని, వీరికి 52590-103290 రూపాయల స్కేల్ వర్తింపచేస్తామని స్పష్టం చేశారు.