తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అవినీతి పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేవరకు పోరాడుతానని టిపిసిసి సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తన 61వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన కృషిని గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్రంలో వేలాది మంది మైనార్టీ విద్యార్థులకు మేలు చేకూరిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ వర్గాల సముద్ధరణకు తాను సమయం వెచ్చిస్తానన్నారు. ఎఐసిసి అధినేత్రి సోనియగాంధీ తీసుకున్న రాజకీయ నిర్ణయం వల్ల తెలంగాణ ఏర్పాటైందన్నారు. గ్రేటర్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరయ్యారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పెద్దసంఖ్యలో మైనార్టీ వర్గానికి చెందిన నేతలు హాజరై పుట్టిన రోజు శుభాకాంక్షలను షబ్బీర్ అలీకి తెలిపారు.