తెలంగాణ

1 నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలోని అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు ఆర్టీసి బస్సులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం శాసనమండలి సమావేశంలో ఆయన సభ్యులు పి. సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల ప్రశ్నలకు సమాధానం చెబుతూ యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి, ధర్మపురి, భద్రాచలం, రామప్ప టెంపుల్, బాసర, ఆలంపూర్, హన్మకొండ భద్రకాళి దేవాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం దేవస్థానానికి ఎనిమిది ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయగా, పర్యాటకులు, భక్తులు రాకపోకలు సాగిస్తున్న అనంతగిరి, నాగార్జునసాగర్‌లకు రెండు వేర్వేరు ప్యాకేజీలను రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. యదాద్రి, కొలనుపాక, కొమరవెల్లి, హైదరాబాద్-వికారాబాద్, అనంతగిరిలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్యాకేజీలను ఆర్టీసి ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తుందని తెలిపారు.