తెలంగాణ
చేపపిల్లల పంపిణీ భేష్: కేరళ మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తలసాని ఆమెకు వివరించారు. మత్స్య రంగంపై సుమారు నాలుగు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లల పంపణీ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు.