తెలంగాణ

ప్రతిభావంతులైన కానిస్టేబుళ్లకు ట్రోఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: గత ఏడాది నియమితులైన 309 మంది పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గురువారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి కృష్ణప్రసాద్ ట్రోఫీలను అందజేశారు.. పోలీస్ కమ్యూనికేషన్స్‌లో పని చేసేందుకు ప్రత్యేకించి నియమితులైన వీరంతా పెట్లూబుర్జ్‌లోని సిఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో డీజీపీ, రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్ టి.కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన 309 మందిలో 101 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలోని కమ్యూనికేషన్స్ విభాగంలో పని చేసేందుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ అదనపుడీజీపీ రవిగుప్తా, సీఏఆర్ అదనపుసీపీ ఎం.శివప్రసాద్, అదనపుసీపీ (పరిపాలన) టి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

చిత్రాలు.. కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గురువారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న డీజీపీ, రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్ టి.కృష్ణప్రసాద్.
*శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను అందజేస్తున్న దృశ్యం