తెలంగాణ

సంస్థాగతంగా బలహీనంగా ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ‘సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.’ అని బిజెపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎస్. రామచందర్ రావు పార్టీ కార్యకర్తలనుద్ధేశించి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీ నగర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం రామచందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామచందర్ రావు ప్రసంగిస్తూ జంట నగరాల్లో పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉందన్నారు. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే సాధ్యమవుతుందని యన తెలిపారు. ఈ సమావేశానికి నగరంలోని సుమారు 50 డివిజన్ల అధ్యక్షులు హాజరుకాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే మెజారిటీ సీట్లు కైవసం చేసుకోగలమన్నారు. వచ్చే నెలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న సమావేశానికి 5 వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా యుద్ధం
టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు వ్యతిరేకంగా తాము ఇదివరకే యుద్ధం ప్రకటించామని రామచంద్రర్‌రావు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 29న చేపట్టనున్న జిహెచ్‌ఎంసి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.