తెలంగాణ

మూడు జిల్లాలకు డిజిటల్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్‌శాఖ నిర్వహించిన ‘డిజిటల్ ఇండియా వీక్’ అవార్డులకు తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలు ఎంపికైనట్టు ప్రభుత్వ ప్రభాన కార్యదర్శి రాజీశ్ శర్మకు సమాచారం అందింది. 28న ఢిల్లీలో నిర్వహించే ‘గుడ్ గవర్నెస్ డే’ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన జిల్లాలకు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డులను బహుకరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన లేఖలో పేర్కొన్నారు. ఐటీ, కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో పై మూడు జిల్లాలు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్టు ఎంపిక కోసం నియమించిన జ్యూరీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు.