తెలంగాణ

తిరుమలకు వెళ్లిన మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టి.టిడిపి బహిష్కృత నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం తిరుమల బయలుదేరారు. బుధవారం అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి ఆ తర్వాత కాలి నడకన కొండపైకి వెళతానని ఆయన చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమై ఆయన్ను రాజకీయంగా సమాధి చేయాలని ఆ వెంకన్నను ప్రార్థించనున్నట్లు ఆయన తెలిపారు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కాబట్టి తన 64వ జన్మదినం సందర్భంగా వెంకన్నకు మానసిక క్షోభను వెల్లడించడానికి వెళుతున్నానని ఆయన వివరించారు. 12న తిరుపతిలో విలేఖరుల సమావేశంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.