తెలంగాణ
13న అమిత్ షా రాక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 July 2018
హైదరాబాద్, జూలై 10: మార్పు కోసం బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకుంది. తొలి విడత యాత్ర సక్సెస్ ఫార్ములాతోనే మలి విడత యాత్రకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ నెల 13న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్న దృష్ట్యా బీజేపీ శ్రేణులు ఆయనను ఘనస్వాగతం పలకాలని నిర్ణయించాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, వికారాబాద్ జిల్లాల నేతలతో రాష్ట్ర నాయకత్వం సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఈనెల 13న బేగంపేట ఎయిర్పోర్టుకు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి అమిత్ షాకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు.