తెలంగాణ

ఢిల్లీలో 16నుంచి లాల్ దర్వాజా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: దేశ రాజధాని ఢిల్లీలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని లాల్ దర్వాజా ఆలయ కమిటీ వెల్లడించింది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా ఆలయ కమిటి మాజీ అధ్యక్షుడు జీ. మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు కే. వెంకటేష్, కోశాధికారి జీ. అరవింద్ గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బోనాల పోస్టర్‌ను వారు విడుదల చేశారు. జూలై 16న సాయంత్రం ఫొటో ఎగ్జిబిషన్, 17న ఇండియాగేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బాజభజంత్రీలతో అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, తెలంగాణ భవన్‌లో ప్రతిష్ఠాపన చేస్తామని కమిటీ వివరించింది.