తెలంగాణ

టీడీపీ దాడులపై కేంద్రానికి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జానతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చెయ్యనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. కన్నా శనివారం ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌లను కలిశారు. అనంతరం కన్నా విలేఖరులతో మాట్లాడుతూ సోమవారం కేంద్రహోం శాఖమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న విషయాన్ని, అలాగే ఏపీ పోలీసులు తమ కార్యకర్తలపై అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏపీలో బీజేపీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేసి, తిరిగి తమ పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు తమ నాయకుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్న విషయాన్ని ప్రధానంగా కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్తామని కన్నా అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి కూడా వివరించనున్నట్టు ఆయన వెల్లడించారు.