తెలంగాణ

రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా నాగుర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వరంగల్ జిల్లాకు చెందిన నాగుర్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి చురుగ్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటున్నారు. రైతుల రుణ విమోచన కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేయడం గమనార్హం. తొలి చైర్మన్‌గా నియమితులైన నాగుర్ల వెంకటేశ్వర్లుకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.