ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్ట్రంలో నవనిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: రాష్ట్ర విభజన దినాన్ని ఎపి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షగా పరిగణించి, ఈ సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి నవ నిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించనున్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగిన వేదికల వద్ద గురువారం నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి జరిగిన అన్యాయం, ఆనాడు యుపిఎ ప్రభుత్వం వ్యవహరించిన తీరును చంద్రబాబు నాయుడు ప్రజలకు మరోసారి వివరించనున్నారు. సరిగ్గా 11 గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్నారు.
అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఒక అవకాశంగా మలచుకుంటున్నాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్టతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం అని ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజలంతా ఈ ప్రతిజ్ఞను చదవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.