తెలంగాణ

కేసీఆర్- షా డ్రామాలు మీడియా చిట్-్ఛట్‌లో ఉత్తమ్ విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమీత్ షా, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆయన శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో అమీత్ షా పర్యటన ఒక డ్రామా అని ఆయన దుయ్యబట్టారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీకి ఎందుకు మద్దతునిచ్చిందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నేతలు ఆశల పల్లకిలో ఉన్నారని అన్నారు. తాజా సర్వే ప్రకారం మహాకూటమి 80 సీట్లలో, టీఆర్‌ఎస్ 20 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో 12 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరవుతారని తెలిపారు.