తెలంగాణ

హిందువులను అవమానిస్తున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: హిందువులను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగరరావు పేర్కొన్నారు. హిందువులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని తేలిపోయిందని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమని తెలిందని చెప్పారు. పంజాబ్ మంత్రి సిద్దూ దక్షిణ భారతదేశం కంటే పాకిస్తాన్ మేలని చేసిన వ్యాఖ్యలను కృష్ణసాగరరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. హిందువులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆలయాల చుట్టూ తిరిగితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు హిందువులు చులకనగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. రామమందిరంపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడించాలని కృష్ణసాగరరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దక్షిణ భారతీయులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. డిసెంబర్ ఏడు తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ కనుమరుగు అవుతోందని చెప్పారు.