హైదరాబాద్

వంద సీట్లు కాదు.. 104 టెంపరేచర్ జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు కాదు, ఆ పార్టీ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు 104 సెజెల జ్వరం వస్తుందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయ శాంతి అన్నారు. వంద సీట్లలలో విజయం సాధిస్తామని కేసీఆర్ ఆదివారం టీఆర్‌ఎస్ అభ్యర్థుల సమావేశంలో మాట్లాడుతూ వంద సీట్లలో పార్టీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం విజయశాంతి కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పంచారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుందని అన్నారు. మహాకూటమి భాగస్వామ్యపక్షాలు సీట్ల సర్దుబాటు విషయంలో సామరస్యంగా చర్చలు జరుపుకోవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ పక్కాగా గెలుపొందే స్థానాలను మిత్రపక్షాలు కోరవద్దని ఆమె సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రధాన పార్టీల నేతలు దూషణ, భూషణలకు దిగారు. టీఆర్‌ఎస్ ‘కారు’ ప్రచారంలో దూసుకెళుతున్నది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టేజేఎస్‌లు ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు జరగవచ్చని అంటున్నారు.