తెలంగాణ

ఉత్తమ్‌కు అధిక మెజార్టీ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, నవంబర్ 11 : వచ్చే ఎన్నికల్లో హుజూ ర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూ ర్యాపేట జిల్లా జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోరారు. గరిడేపల్లిలో ఆదివారం ముఖ్య నాయకులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఒక్కో కార్యకర్త ఒక ఉత్తమ్‌లా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని నియోజకవర్గాలపై దృష్టిపెట్టాల్సివుందని దీనిని గమనించి నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు ముందుకొచ్చి ఉత్తమ్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్‌కు సముచితమైన స్థానం దక్కే అవకాశం ఉందని ప్రతి కార్యకర్తా గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సైనికునిలా పనిచేసి రాష్ట్రంలోనే హుజుర్‌నగర్ నియోజకవర్గాన్ని మెజార్టీలో ప్రథమంగా నిలపాలని కోరారు. అనంతరం ఎన్నికలు జరిగే వరకూ ఎలా పనిచేయాలి, ఎన్నికల ప్రత్యేక కమిటీల నియామకం తదితర విషయాలపై చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడెల్లి అంజయ్య, మూలగుండ్ల సీతారాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పయిడిమర్రి రంగనాథ్, జడ్పీటీసీ పెండె శ్రీనివాస్‌గౌడ్, గుండు రామాంజి, మూలగుండ్ల సైదిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పోలగాని వెంకటేశ్వర్లుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గరిడేపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్ పద్మావతి