తెలంగాణ

కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 11: గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో లేని అభివృద్ధి టీఆర్‌ఎస్ నాలుగున్నర ఏళ్లలో చేసిందని, కేసీఆర్ చల్లని పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో 26వ రోజు ఇంటింటికి ప్రచార పాదయాత్ర న్యూ వీటీ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో కొనసాగించగా పెద్ద ఎత్తున స్థానికులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మహాకూటమి ఓడిపోవడం ఖాయం అన్నారు. నల్లగొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, 20ఏండ్లుగా కోమటిరెడ్డి మోసపు మాటలతో కాలం వెల్లదీశాడని విమర్శించారు. తనను అశీర్వదించి గెలిపిస్తే నల్లగొండను అభివృద్ధి చేస్తానన్నారు. బోయపల్లి కృష్ణారెడ్డి, అబ్బగోని రమేష్, శరణ్యారెడ్డి, ఫరీదుద్దిన్, రాం మోహన్, మైనం శ్రీను, రహీం ఖాన్, జగదీశ్వర్, ఆలకుంట్ల మోహన్ బాబు, జమాల్ కాద్రి తదితరులున్నారు.

చిత్రం..ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి