తెలంగాణ

కేసీఆర్ అబద్ధాలతో జనం విసిగిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 21: నాలుగేళ్ళ కేసీఆర్ పాలన చూసి విసిగి చెందిన ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. అబద్ధాల సీఎం అని తెల్సిపోయిందని, రోజుకో అబద్ధం ఆడుతూ ఆయన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వెల్లడించారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కెకె. మహేందర్‌రెడ్డి, మహకూటమి నాయకులు పాల్గొన్న ఈ రోడ్డు షో సమావేశం స్థానిక గాంధీ చౌక్‌లో జరిగింది. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలన అంతం చేయడనాకి ప్రజలు సిద్ధం కావాలని, లేని పక్షంలో దొరల పాలన, గడీల రాజ్యం, నియంత పాలన తప్పదని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తాను ఆమరణ దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చిందని అబద్ధం ఆడుతున్నాడని, దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటా, అల్లుడొస్తే ఉండడానికి డబుల్ బెడ్ ఇళ్ళు ఇస్తా, అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్, మూడు ఎకరాల భూమి ఇస్తానని అన్నింటిలోనూ అబద్దం ఆడి ప్రజలను మోసం చేశాడని, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న కేటీఆర్ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నా ఇవి అమలు లేవన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, వీటిని తప్పించుకోవడానికి ఎన్నికలు తెచ్చాడన్నారు. అంబులెన్సుల్లో కేసీఆర్ డబ్బు తరలిస్తున్నాడని ఆరోపించారు. తాము వస్తే ట్రాఫిక్‌ను అనుమతించి తమ సమావేశానికి ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులు, కేసీఆర్ వస్తే మూడు రోజులు ట్రాఫిక్ బంద్ చేస్తారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా నిస్తానని మోదీ మాట మారిస్తే, ఇక్కడ సోనియా తెలంగాణ ఇస్తే దానిపై కేసీఆర్ మాట మార్చాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలకులు ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బు, మద్యం ఇస్తారని, వాటిని తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని హన్మంతరావు పిలుపునిచ్చారు. తొలుత హన్మంతరావుకు పార్టీ శ్రేణులు మానేరు వంతెన వద్ద స్వాగతం పలికారు. యువజన కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.