తెలంగాణ

బీజేపీ గుండాలే దాడి చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఎన్నికల పోలింగ్ సందర్భంగా జంగారెడ్డి పల్లె పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించేందుకు వెళ్లిన తనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీచంద్ రెడ్డి ప్రస్తుతం ‘నిమ్స్’లో కోలుకుంటున్నారు. శనివారం తనను కలిసిన విలేఖరులతో వంశీ మాట్లాడుతూ సమస్యాత్మ ప్రాంతంలోని జంగారెడ్డి పల్లె పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళే ముందు తనకు తగిన భద్రత కల్పించాలని అధికారులను కోరినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. వాహనంలో బయలుదేరి తనపై రాళ్ళతో దాడి చేశారని ఆయన చెప్పారు. తన గెలుపును ఎవరూ నిలువరించలేరని ఆయన ధీమాగా అన్నారు.