తెలంగాణ

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్-ఎల్‌పి సమావేశంలో ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను శాసనసభాపక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో జాప్యం జరిగిందని, ఇప్పుడు తానే స్వయంగా చొరవ తీసుకుని ప్రక్రియను వేగవంతం చేస్తానని ఆయన చెప్పారు. కేరళ, కర్నాటక రాష్ట్రాలు పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని ఒక విలేఖరి ప్రస్తావించగా, ఈ విషయంలో అధ్యయనం చేయించి తామూ ఇస్తామని ఆయన సమాధానమిచ్చారు.