తెలంగాణ
రాహుల్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం: బీజేపీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 15 December 2018
హైదరాబాద్, డిసెంబర్ 14: రాఫెల్ ఒప్పందానికి సంబంధించి రాహుల్గాంధీ చేసిన అవినీతి ఆరోపణలు బాధ్యతారాహిత్యమని సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లం అయిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. రాఫెల్ డీల్మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పిందని అన్నారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాఫెల్లో లేనిపోని వివాదాలను సృష్టించి దుష్ప్రచారం చేయాలని అంతా అనుకున్నారని పేర్కొన్నారు. రాజకీయ విలువలు దిగజారుడు అంటే ఇదేనని అన్నారు. రాహుల్గాంధీ అవినీతి ఆరోపణలు బాధ్యతారాహిత్యమని చెప్పారు. బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ప్రజలకు చాలా స్పష్టత ఉందన్నారు.