తెలంగాణ

కార్యకర్తలూ అధైర్యపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, డిసెంబర్ 16: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామశాఖ నాయకులు అధైర్య పడొద్దని జానారెడ్డి నీవెంటే ఉంటారని సీఎల్‌పీ మాజీ నేత, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజకీయంలో గెలుపోటములు సహజమన్నారు. ప్రతి కార్యకర్త విజయం కోసం కృషి చేశారన్నారు. రైతులు, వృద్ధులు కేసీఆర్ మోసపూరిత మాటలకు ప్రలోభ పడి టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రాబోయే స్థానిక, పార్లమెంట్, కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రతికార్యకర్త కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. జానారెడ్డి ఒకరి దగ్గర చేయి చాపి పదవులను ఆశించే వ్యక్తి కాదని జానారెడ్డి అంటే ఒక మహాశక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు జాల చినసత్తయ్య యాదవ్, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కంచర్ల యాదగిరి రెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, కుప్ప రాములు, వీ. యాదగిరి గౌడ్, రంగినేని నర్సింహారావు, లెంకల అశోక్‌రెడ్డి, కుప్ప సురేందర్, వెల్డొండ నర్సిరెడ్డి, కుప్ప అమరేందర్ గౌడ్, మాదనబోయిన నాగమణి, జక్కల భాస్కర్, పాల్గొన్నారు.

చిత్రం.. కార్యకర్త సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్‌పీ మాజీ నేత కందూరు జానారెడ్డి