తెలంగాణ
మద్యం కంపెనీలకు నీటిని నిలిపివేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 June 2016
హైదరాబాద్, జూన్ 6: మద్యం కంపెనీలకు నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ తెలుగుదేశ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు బస్తీల్లో తాగేందుకు నీళ్లు లేక అలమటిస్తుంటే.. మద్యం కంపెనీలకు ఎలా సరఫరా చేస్తారని ఆయన ప్రశ్నించారు. మద్యం సేవించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ రేవంత్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. పిల్పై విచారణ జరిపిన కోర్టు వాటర్ బోర్డు, జిహెచ్ఎంసికి నోటీసులు జారీ చేసింది. నీటి సరఫరాపై మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.