తెలంగాణ

ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: లోక్‌సభ ఎన్నికల తర్వాతే అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని, అప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్‌కే పరిమితం అవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, కాలె యాదయ్య, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున తాము కూడా ఓట్ ఆన్ అకౌంట్‌కే వెళతామని అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ముగిసిన తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఫిబ్రవరి నుంచి మే వరకూ పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించాలని, గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ గ్రామాభివృద్ధి సంస్థ, ఆస్కి, ఎంసీఆర్-హెచ్‌ఆర్‌డీ తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని ఆయన సూచించారు.
ప్రతీ గ్రామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలని ఆయన సూచించారు. కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి పని చేయడానికి అవసరమైన అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు మూస పద్ధతిలో కాకుండా, గ్రామాల సమగ్ర వికాసానికి పాటుపడే ఉద్యమకారులుగా తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం కోసం పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా జరుగుతున్నదన్నారు. గ్రామాభివృద్ధిలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలకు విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతుందన్నారు.