తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రజల పక్షమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినందుకే రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని అందుకే గవర్నర్ ప్రసంగంలో చేర్చారన్నారు. అన్ని రంగాల్లో వౌలిక వసతులు కల్పించారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి వ్యాపార దిగ్గజాలు ముందుకు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం పెరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శింగా నిలపాలన్నదే కేసీఆర్ సంకల్పం అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంచడానికి కేసీఆర్ కేంద్రంపై వత్తిడి తీసుకువస్తారని చెప్పారు.