తెలంగాణ

సత్తుపల్లిని జిల్లాగా ఏర్పాటుచేయాలి: పొంగులేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావంతో జిల్లాల ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ అశ్వారావుపేట కలిపి సత్తుపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో బీడు భూములకు సాగునీటిని అందించడానికి నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేసీఆర్ చేస్తున్న డిమాండ్ గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ నిజంగా కాళ్వేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసినట్లుగా లేదన్నారు. కేంద్రం ప్రకటించినట్లుగా వివిధ శాఖల్లో ప్రగతి కన్పించడంలేదన్నారు.