తెలంగాణ

కరవు మండలాలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: కరీంనగర్ జిల్లాలో కరవు మండలాలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో రెండు వారాలలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరవు మండలాల ఎంపికపై నియమించిన కమిటీ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో 21 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వివిధ అంశాల ప్రాతిపదికన 40 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ నివేదిక పంపించారని జీవన్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం జిల్లా అంతా కరవుతో విలవిలలాడుతుండగా, 21 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు.