తెలంగాణ

పల్లెపోరులో కారు జోరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 22మండలాల్లో ముగిసిన తొలి విడత పంచాయతీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సింహభాగం సర్పంచ్ స్థానాలు గెలుచుకుని పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సంబరాల్లో ముంచెత్తింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సర్పంచ్‌ల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయి నాయకులను సమన్వయం చేసి మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగిన 590గ్రామ పంచాయతీల్లో 352గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్‌లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 166స్థానాలకు పరిమితంకాగా ఇతరులు 72స్థానాల్లో గెలుపొందారు. ఇతర పార్టీలు, స్వతంత్రుల్లో సైతం ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం కనిపిస్తుంది. కాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దేవరకొండ, సూర్యాపేట, ఆలేరు, కోదాడ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించడం విశేషం. మునుగోడు ఎమ్మెల్యే మాదిరిగా నాగార్జున సాగర్, దేవరకొండ, కోదాడ, ఆలేరు నియోజకవర్గాల కాంగ్రెస్ ఓడిన అభ్యర్థులు సైతం పట్టుదలగా ఉంటే కనీసం 200సర్పంచ్ స్థానాలైన కాంగ్రెస్ గెలిచి ఉండేదన్న వాదన వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముందెన్నడు లేని రీతిలో ఎదురైన ఓటమితో ఢీలా పడిన కాంగ్రెస్ అభ్యర్థులు నిరాశతో సర్పంచ్ ఎన్నికలపై ఉదాసీనత ప్రదర్శించినప్పటికి గ్రామాల్లో కాంగ్రెస్ నుండి నిలబడిన అభ్యర్థులు తమ గెలుపు కోసం శ్రమటోడ్చిన నేపధ్యంలో టీఆర్‌ఎస్ సాధించిన సర్పంచ్ స్థానాల్లో సగం వరకైనా దక్కాయని కాంగ్రెస్ కేడర్ భావిస్తుంది. టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లాలో 175, సూర్యాపేట జిల్లాలో 108, యాదాద్రి భువనగిరిజిల్లాలో 69స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో 102, సూర్యాపేటలో 45, యాదాద్రిలో 19స్థానాలు దక్కించుకుంది.
మరోవైపు తొలి విడత పంచాయతీ పోరులో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలతో జోరుమీదుండటంతో దీని ప్రభావం రెండు, మూడో విడతల్లో ఎన్నికల పోలింగ్‌పై పడుతుందన్న ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతుంది. అధికార పార్టీకి చెందిన వారిని గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధికి నిధులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు దక్కే అవకాశముందన్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా సాగిస్తున్నారు. దీనికి తోడు తొలి విడత ఫలితాల ఆధిపత్యం తదుపరి పంచాయతీల పోలింగ్‌పై ప్రభావం చూపినట్లయితే కారు జోరు ఈ నెల 25, 30న జరిగే రెండు, మూడో విడత పంచాయతీల పోలింగ్‌లోనూ అదే స్పీడ్‌లో కొనసాగక తప్పదన్న ధీమా గులాబీ వర్గాల్లో కనిపిస్తుంది.