తెలంగాణ

మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా రణం జ్యోతిని నియమించారు. మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్ బాపురెడ్డి, మహబూబ్‌నగర్ చైర్మన్‌గా చెరుకుపల్లి రాజేశ్వర్‌లను నియమించారు. గత మూడు రోజుల నుంచి వరుసగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలను నియమిస్తున్నారు. ఆయా నియోజక వర్గాల శాసన సభ్యులు, పార్టీ నాయకుల సిఫారసుల మేరకు ఈ నియామకాలు జరుగుతున్నాయి. తొలిసారిగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు అమలు చేశారు. అదే విధంగా మహిళా కోటా కూడా నిర్ణయించారు.