తెలంగాణ

లోక్‌సభ ఎన్నికలకు సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఆర్గినైజింగ్ కార్యదర్శులు, ఇతర పార్టీ నేతలతో గురువారం సాయంత్రం సమీక్షించారు. ‘ మేరా పరివార్- బీజేపీ పరివార్ ’ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 నుండి మార్చి 2వ తేదీ వరకూ నిర్వహించాలని అమిత్ షా పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ అభిమానులు అంతా తమ ఇళ్లపై బీజేపీ జండాలను ఎగురవేయాలని, మరో పక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్సింగ్‌లో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు హైదరాబాద్ నుండి పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని అమిత్ షా సూచించారు. మేరా పరివార్ - బీజేపీ పరివార్ కార్యక్రమం ముగింపు రోజైన మార్చి 2వ తేదీన 4100 అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోగానే బూత్ స్థాయి కమిటీలు, శక్తి కమిటీలు, నియోజకవర్గాల వారీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 11న సమర్పణ దివస్ నిర్వహించాలని, ఫిబ్రవరి 28న కమల జ్యోతి కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఇళ్లల్లో దీపాల పండుగగా నిర్వహించాలని, నా ఇల్లు- బీజేపీ ఇల్లు అని దేశవ్యాప్తంగా ఇంటి మీద జండా పండుగ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో మార్చి 2వ తేదీలోగా మేథావులతో భేటీలు నిర్వహించాలని సూచించారు. నరేంద్రమోదీ తిరిగి పూర్తిస్థాయిలో మంచి మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడానికి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు
వ్యవసాయ రుణాల పరిమితి పెంపు: లక్ష్మణ్
పెట్టుబడి వ్యవసాయాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సన్నకారు రైతులకు హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని లక్ష నుండి 1.60 లక్షల రూపాయిలకు పెంచుతూ ఆర్‌బీఐ ప్రకటించడం హర్షణీయమని డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. రైతులు ప్రైవేటు రుణాలు తీసుకోకుండా ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ రైతాంగం తరఫున బీజేపీ రాష్ట్ర శాఖ ఆర్‌బీఐకి, ప్రధానికి ధన్యావాదాలు తెలిపింది.

చిత్రం..అమిత్‌షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు