తెలంగాణ
ఏలూరు బీసీ గర్జనకు జగన్ పిలిచారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 February 2019
హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 17న ఎలూరులో జరగనున్న బీసీ గర్జనకు తనను ఆహ్వానించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసం లోటస్ పాండ్లో కృష్ణయ్య భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్ను కోరినట్లు చెప్పారు. పార్లమెంట్లో మొట్టమొటిగా బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టినందుకు జగన్ అభినందించినట్లు చెప్పారు. రాజ్యసభలో సైతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైపాకా లేవనెత్తుతామని జగన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.