తెలంగాణ

నేడు తలసాని ఆంధ్ర పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధ, గురువారాల్లో (13, 14న) మరోసారి ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటనకు వెళుతున్నారు. గత నెల సంక్రాంతి పండుగ సమయంలోనూ ఆయన ఆంధ్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మీడియాతో మాట్లాడారని, పైగా రాజకీయాలు మాట్లాడారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్ర పర్యటనకు వెళ్ళడంలోని ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతున్నది. అయితే తాను తోట త్రిమూర్తులు కుమారుని వివాహానికి హాజరయ్యేందుకే వెళుతున్నానని తలసాని చెప్పారు. బుధవారం రాజమండ్రిలో వివాహానికి హాజరై, మర్నాడు గుంటూరులో జరిగే మరో వివాహానికి హాజరై హైదరాబాద్ తిరిగి రానున్నట్లు ఆయన తెలిపారు. కాగా తలసాని పర్యటనలో తప్పకుండా ఏదో మర్మం దాగి ఉందన్న అనుమానాలను టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల టీఆర్‌ఎస్-వైకాపా సఖ్యతతో ఉంటున్నందున, వైకాపాకు మద్దతుగానే తలసాని పర్యటన చేయనున్నారన్న టీడీపీ నాయకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆంధ్రలో పర్యటించనున్నందున, ఆ ఏర్పాట్ల కోసమే తలసాని పర్యటించనున్నారని అనుమానిస్తున్నారు.