తెలంగాణ

చెరువులు కళకళలాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మిషన్ కాకతీయతో చెరువులకు మళ్ళీ పునర్ వైభవం తీసుకుని రావాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్దాల తరబడి ముఖ్య నీటి వనరులుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో మిషన్ కాకతీయ - చిన్న నీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, నీటి పారుదల శాఖ ఇఎన్‌సీ మురళీధర్‌రావు, ‘కాడా’ కమిషన్ మల్సూర్, సీఇ శ్యాం సుందర్, కాడా డీడీ స్నేహ, రిటైర్డ్ ఇఎన్‌సీ విజయ్ ప్రకాశ్, సీఎం ఓఎస్‌డీ శ్రీ్ధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నీళ్ళు, వర్షం నీళ్ళు, పడబాటు నీళ్ళు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించాలని, వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని అన్నారు. చెరువులన్నీ నిండి కళకళలాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లని ఆయన తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో చిన్న నీటి వనరుల వ్యవస్థ ఎంతో బ్రహ్మాండంగా ఉండేది, కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు అద్భుతంగా పండేవి అని అన్నారు. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరు అందేది అని ఆయన తెలిపారు. చెరువులకు నీళ్ళు పారేందుకు సహజసిద్ధమైన కాలువలు ఉండేవి అని ఆయన వివరించారు. జాలువారు నీళ్ళతో చెరువులు నిండేవని, 1974లోనే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టీఎంసీల నీళ్ళు కేటాయింపు ఉందన్నారు. రానురాను చెరువులు నాశనం అయ్యాయని, తెలంగాణ బతుకు నాశనం అయ్యిందని, తెలంగాణ రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకున్నారని ఆయన తెలిపారు. అయినా పంటలు సరిగా పండలేదని, వ్యవసాయం దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నామని, చెరువులను బాగు చేసుకున్నామని అన్నారు.