తెలంగాణ

బీజేపీలోకి శివసేన మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: శివ సేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. మహేష్‌తో పాటు అనేక మంది శివసేన కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారి చేరిక పట్ల డాక్టర్ లక్ష్మణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆరోగ్య ప్రదర్శనలో పాల్గొన్న దత్తాత్రేయ
నగరంలోని నెక్లెస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఆయుష్’ నిర్వహించిన ‘ఆరోగ్య ఫెయిర్’ ముగింపు కార్యక్రమంలో బీజేపీ లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ ప్రసంగిస్తూ నిర్వాహకులను అభినందించారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఇటువంటి ప్రదర్శనలు అవసరమని అన్నారు.
చిత్రం.. బీజేపీలో ఆదివారం చేరిన శివసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్, అతడి అనుచరులు