తెలంగాణ

పార్టీ వ్యవహారాల్లో కొప్పుల రాజు జోక్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సి కుంతియా స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలలో ఉమ్మడిగా అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కుంతియా వివరించారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జీగా తనతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, స్థానిక నాయకులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కుంతియా పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన ఏ అంశంలో అయినా ఎలాంటి ఫిర్యాదులు, సవరణలైనా పీసీసీ అధ్యక్షుడికిగానీ, ఏఐసీసీ కార్యదర్శులకుగానీ ఫిర్యాదులు చేయవచ్చాన్నారు. అలా కాకుండా నేరుగా పత్రికలకు ఎక్కడం, బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణ రాహిత్యం అవుతుందని కుంతియా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా క్రమశిక్షణకు లోబడి పని చేయాల్సి ఉంటుందని కుంతియా హెచ్చరించారు.