తెలంగాణ

సిద్దిపేట సమీకృత మార్కెట్ నిర్వహణ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 14: సిద్దిపేట జిల్లా కేంద్రంలోనూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌లోని చేపల మార్కెట్‌ను భారత ప్రభుత్వ మత్స్యశాఖ, వ్యవసాయశాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి రజనీ సేకరి సిబాల్ సందర్శించారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచటంపై చక్కగా ఉందని కితాబునిచ్చారు. మత్స్యకారులకు తెలంగాణ సర్కార్ 75 శాతం రాయితీపై అందచేసిన వివిధ రకాల పరికరాలు వలలు, తెప్పలను, బాక్స్‌లను పరిశీలించారు. మత్స్యకారులకు సబ్సీడీపై అందచేసిన ద్వీచక్ర వాహనాలు, టాటా ఏసీ వాహనాలను పరిశీలించారు. తెలంగాణ సర్కార్ మత్స్య సంక్షేమ శాఖ అభివృద్ధికి చేపట్టిన చర్యలను ప్రశంసించారు. సీఇఓ రాణి కుముదిని, మత్స్య అభివృద్ధి సంస్థ కమిషనర్ సువర్ణ, సిద్దిపేట కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేడీ శంకర్ రాధోడ్, డైరెక్టర్ శ్రీనివాస్, ఉప సంచాలకులు లక్ష్మీనారాయణ, వెంకయ్య, ధనలక్ష్మి పాల్గొన్నారు.