తెలంగాణ

ఏఈ సంతోష్ కుటుంబాన్ని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 18: అనారోగ్యంతో మృతి చెందిన ఏఈ నాగోలు సంతోష్ కుటుంబాన్ని ఆదుకుంటామని విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. సోమవారం విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌధలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతోష్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రభాకర్ రావు, టీఇఇఏ అధ్యక్షుడు శివాజీతో కలిసి సంతోష్ తల్లి కృష్ణవేణికి రూ.5లక్షల 20వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో నియామకం అయిన యువ ఇంజనీరు మృతి చెందడం అటు కుటుంబానికి, ఇటు సంస్థకు తీరని లోటని అన్నారు. తోటి ఉద్యోగులుగా అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ తరఫున ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వినద్‌కుమార్, రవికుమార్, అనిల్, అఖిల్, మోనిక, వినయ్, నరేష్ పాల్గొన్నారు.