తెలంగాణ

ఓట్ల కోసం కేసీఆర్ హిందుత్వ గాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వం మళ్లీరావాలని కోరుకుంటున్నారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆ సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణలోని ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఎదురుదెబ్బ తగులుతుందనే తెలంగాణ సెంటిమెంట్ తెచ్చి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారని అన్నారు. తెలంగాణ ప్రజల మూడ్ ఎలా ఉందో కేసీఆర్‌కు అర్ధమైందని , అందుకే బీజేపీపైనా, నరేంద్రమోదీపైనా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో సోయిలేకుండా మాట్లాడుతున్నారని , హిందూ గాళ్లు అనడం, దిక్కుమాలిన వంటి పదాలను వాడుతున్నారని ఇది హిందువులను కించపరచడమేనని చెప్పారు. హిందువులు అందరికీ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అన్నారు. మొత్తం హిందూజాతి క్షమించాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఇంద్రసేనారెడ్డి అన్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ఎన్నికల కమిషన్‌కు కేసీఆర్‌పై ఫిర్యాదు చేసిందని చెప్పారు. జయచంద్రుడనే రాజు మహ్మద్ గోరీకి సహకరించాడని, రజాకర్ల వారసులైన ఎంఐఎంకు హిందూ కోవర్ట్ మాదిరి పృధ్విరాజ్‌కు మోసం చేసిన జయచంద్రుడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మెడమీద కత్తిపెట్టినా జాతీయ గీతం పాడనని చెప్పిన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ నకిలీ హిందువని, కేసీఆర్ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఔరంగజేబుతో చేతులు కలిపిన జైసింగ్ కేటగిరికి కేసీఆర్ చెందుతారని , కేసీఆర్ హిందూ వ్యతిరేకని, ఈబీసీ అమలుచేయడం లేదంటే అగ్రకులవ్యతిరేకి అని అర్ధం అవుతోందని చెప్పారు. రాష్ట్రంలో 16 మంది గెలిస్తే ఢిల్లీలో ఏం సాధించగలరు? గత ఐదేళ్లుగా మీ వద్ద ఉన్న ఎంపీల సంఖ్య ఎంత ? గత ఐదేళ్లుగా మాట్లాడని ఎంపీలు ఇపుడేం చేస్తారు? అని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో చింతా సాంబమూర్తి, వన్నాల శ్రీరాములు, డాక్టర్ ఎస్ ప్రకాశ్‌రెడ్డి, అఫ్సర్ పాషా, జీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.