తెలంగాణ

కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే హిందువునని చెప్పుకుంటున్నారని, ఆయన హిందువు అవునో కాదో తెలియదని, ఓవైసీ కంటే మాత్రం పెద్ద ముస్లిం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. శనివారం నాడు ఫిక్కీ నిర్వహించిన మహిళా విభాగం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీని ఏలుతామని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్‌లు బరిలో లేరని, ఇంతకీ వారి ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చి చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. అంతకుముందు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, మోదీకి ఫార్మ్‌హౌస్‌లు లేవని, రెస్టు హౌస్ కూడా లేదని అన్నారు. విదేశాల్లో రిసార్టులు, రిక్రియేషన్ క్లబ్‌లు లేని ప్రధాని నరేంద్రమోదీ మాత్రమేనని అన్నారు. దేశానికి నరేంద్రమోదీ నిజమైన చౌకీదార్ అని చెప్పారు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చూసినా ఫ్యామిలీ వారసులే కనిపిస్తారని, ఒక్క బీజేపీ మాత్రమే వారసత్వం లేని పార్టీగా నిలిచిందని అన్నారు. పాక్ సైన్యానికి చిక్కిన అభినందన్ తిరిగి 24 గంటల్లో దేశానికి ఎలా వచ్చారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. 25వ తేదీన బషీర్‌బాగ్ అమ్మవారికి పూజ చేసి హైదరాబాద్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన చెప్పారు.