తెలంగాణ
అమిత్షా చెప్పేవన్నీ అవాస్తవాలే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
న్యూఢిల్లీ, జూన్ 16: తెలంగాణకు కేంద్ర చేసిన సహాయం విషయంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా అవాస్తవాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి విమర్శించారు. ఢిల్లీలో గురువారం వేణుగోపాలాచారి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. కేంద్రం నుండి తెలంగాణకు రూ 96 వేల కోట్లు మంజూరు చేశామని చేప్పడం అవాస్తమని, అలాగే అమిత్ షా చెప్పేదే వాస్తవం అయితే కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు విడుదల చేసిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.