తెలంగాణ

వడదెబ్బకు ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్ / అమ్రాబాద్, ఏప్రిల్ 22: వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రానికి చెందిన పాష (65) అనే వ్యక్తి గురువారం రాత్రి వడదెబ్బతో మృతి మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురైన పాష అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తహశీల్దార్‌కు ఈ విషయాన్ని తెలుపడంతో రెవిన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని మారడుగు గ్రామంలో సోమవారం మేడారం అంబమ్మ (52) అనే ఉపాధి హామీ కూలీ గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో మరికొంతమంది కూలీలతో కలిసి చదును చేస్తుండగా వడదెబ్బకు స్పృహతప్పి పడిపోయి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్రాబాద్ ఎంపీడీవో వెంకటయ్య మారడుగు గ్రామానికి వెళ్లి మృతురాలి బంధువులను పరామర్శించి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు.
పాన్‌గల్‌లో మృతి చెందిన పాష (ఫైల్‌ఫొటో)