క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హర్, ఏప్రిల్ 22: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్లలో సోమవారం ఉదయం పిడుగుపాటుకు గురై కప్పాల కుమారస్వామి (36) అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గోపి (30) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. సోమవారం తెల్లవారుఝామున తన పొలం వద్దకు రాగానే అకస్మాత్తుగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు భార్య లక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్‌నాయక్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.
చిత్రం... మృతుడు కుమారస్వామి