తెలంగాణ

నరహంతకుడు శ్రీనివాస్‌ను ఉరి తీయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, మే 16: హాజీపూర్ నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ అతని చేతిలో హత్యకు గురైన శ్రావణి, కల్పన, మనీషాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలోని గుడిబాయిచౌరస్తా వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. గురువారం హాజీపూర్ నుండి బొమ్మలరామారం వరకు శ్రీనివాస్‌రెడ్డిచేతిలో హత్యకు గురైన బాలికల కుటుంబాల సభ్యులు పాదయాత్ర నిర్వహించిన అనంతరం గుడిబాయి చౌరస్తావద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ తిర్మల కవితావెంకటేశ్, ఫక్కీర్‌రాజేందర్‌రెడ్డి, మైలారం జంగయ్యలు మాట్లాడుతూ శ్రావణి, కల్పన, మనీషాల హత్యలకు పాల్పడ్డ శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.