తెలంగాణ

లోటస్‌పాండ్ వద్ద కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు భారీగా లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా అభిమానులతో కోలాహలంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులతోపాటు పార్టీ శ్రేణులు లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు. భారీ బాణసంచా కాల్చారు. ఏపీలో అఖండ విజయం సాధించిన సందర్భంగా అభిమానుల్లో సంతోషం మిన్నంటింది. అంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాట్లపై చర్చించారు. జగన్మోహనరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు పార్టీ సీనియర్ నేతలతో కలిసి నివారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. అనంతరం లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు.