తెలంగాణ

రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: కాంగ్రెస్‌పార్టీ వల్ల అన్ని పదవులు అనుభవించిన ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్‌గోపాల్ రెడ్డి వ్యవహారం ఎఐసీసీ పరిధిలో ఉందన్నారు. దానిపై తాము స్పందిస్తామన్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం తప్పన్నారు. బీజేపీలోకి వెలితే భవిష్యత్తులో జరిగే నష్టం గురించి చెప్పానన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ వివరాలను ప్రకటించాలన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తానుకట్టానని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలని ఆయనన కేసీఆర్‌కు హితవుపలికారు. కాళేశ్వరం వద్ద అంబేద్కర్ ,సోనియాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.