తెలంగాణ

మా ఆఫీసుకు భూమి కేటాయించండి: తమ్మినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న సీపీఎంకు కార్యాలయాల నిర్మాణానికి భూమిని కేటాయించాలని తెంలగాణ కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రెవిన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. రాజకీయ పార్టీలకు భూమిని కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సీపీఎం 16 జిల్లా కేంద్రాల్లో ప్రతి చోట ఒక ఎకరం చొప్పున స్థలాన్ని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకుందని, నిర్ణీత పద్థతిలో తాము దరఖాస్తు చేసినా సీపీఎంకు ఎక్కడా భూమి కేటాయింపు జరగలేదని అన్నారు. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న టీఆర్‌ఎస్‌కు 31 జిల్లాల్లో భూమిని కేటాయిస్తూ వారికి భూమిని కూడా స్వాధీన పరిచిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వివక్ష వీడి స్థల కేటాయింపు జరపాలని ఆయన పేర్కొన్నారు.