తెలంగాణ

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 28: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు. సుక్మా జిల్లాలోని గాదిరాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బడేశెట్టి అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు పంచాయితీ కమిటీ అధ్యక్షుడు పొడియామి సోమడా, డీఏకెఎంఎస్ అధ్యక్షుడు సోనీ, జనమిలీషియా సభ్యుడు హిడమా కమలు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సంఘటనా స్థలంలో మూడు తుపాకులు లభ్యమయ్యాయి. పారిపోయిన నక్సల్స్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేస్తున్నారు.