తెలంగాణ

మున్సిపోల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల/పాలకీడు, జూలై 6: రాష్ట్రంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం నేరేడుచర్ల, పాలకీడు మండలాల కాంగ్రెస్‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీకి సమన్వయకర్తల నియామకం కోసం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో అధ్యక్షుల నియామకం కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 12న మున్సిపాలిటీ ఓటర్ల లిస్ట్ విడుదలవుతుందని, ఈనెల 12-16వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, వీటిపై ఓటర్ల సవరణలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలోని వార్డులను కులాలవారీగా, రిలీజన్ వారీగా అవకతవకలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో 2014-18 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో రూ.3,116 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు.
చిత్రం... సమావేశంలో ప్రసంగిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్